అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Modi Governance | పన్నెండేళ్ల పాలనలో సూపర్ ఎకనామికల్ పవర్గా భారత్ తీర్చిదిద్దబడిందని ఎంపీ అర్వింద్ అన్నారు. దేశంలో ప్రధానిగా మోదీ(PM Modi) 12ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలకు సంబంధించి పుస్తకాలను నగరంలో పలువురికి అందజేశారు.
Modi Governance | జిల్లాలో ప్రముఖులకు..
ఈ సందర్భంగా అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి కుమారి గుగులోత్ సౌమ్య, చార్టెడ్ అకౌంటెంట్ గురుప్రసాద్, న్యూరో సర్జన్ కట్ట నర్సింహా, న్యాయవాది సంఘమేశ్వర్ రావు, ముదిరాజ్ సంఘం నాయకులు, భజనకారులు అంబెం నడిపి సాయన్న, రంజీ క్రికెటర్ అనికేత్ రెడ్డిలకు పుస్తకాలు అందజేశారు.
కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : VinFast Car Issue | షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు.. తమకు సంబంధం లేదన్న సిబ్బంది.. కస్టమర్ ఆందోళన