అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Police Promotions | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పలువురు హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా వారిని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ప్రత్యేకంగా అభినందించారు.
Nizamabad Police Promotions | డీజీపీ ఆదేశాల మేరకు..
కమిషనరేట్ పరిధిలో పదకొండు మంది హెడ్కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారంతా సీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్యను మర్యాదపూర్వంగా కలిశారు. వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. పదోన్నతుల బాధ్యత మరింత పెరిగిందని.. నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు.
పదోన్నతి పొందిన వారు వీరే..
గంగాధర్ రావు (నందిపేట), రాజేశ్వర్ (ఉమెన్ పోలీస్ స్టేషన్), మోహన్ (సీసీఎస్ పోలీస్ స్టేషన్), జగదీశ్వర్ (పీసీఆర్), చిన్న సాయిలు(సీఎస్బీ), రాజశేఖర్(డిచ్పల్లి), రాజేందర్ (సిరికొండ), సుదర్శన్ (నవీపేట్), డేనియల్ భాస్కర్ (టౌన్ వన్ పోలీస్ స్టేషన్), సుంకన్న (టౌన్ 2 పోలీస్ స్టేషన్), మల్లేశం(వర్ని).
ఇది కూడా చదవండి..: Ambedkar Ideals | అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి : ముత్యాల సునీల్