అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : OBC National Conference | బెంగళూరులో జరుగుతున్న ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ (Nizamabad) బీసీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఈ మహాసభలు జరుగుతున్నాయి.
OBC National Conference | మండల్ సిఫార్సులు అమలైన సందర్భంగా..
ఆగస్టు 7న మండల సిఫార్సులు అమలై బీసీలకు రిజర్వేషన్లు వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తుంటారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ ఏడాది కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లాలోని బీసీలు పెద్దఎత్తున హాజరయ్యారని ఆయన వివరించారు. దేశంలో ఎక్కడ బీసీ కార్యక్రమం జరిగిన నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొని మన గళాన్ని వినిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మహాసభల్లో సంఘం ప్రతినిధులు కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్ కుమార్, చంద్రకాంత్, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, చంద్రమోహన్, భూమన్న, రవి, బాలన్న శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mittapalli Temple | మిట్టపల్లి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు