అక్షరటుడే, వెబ్డెస్క్ : Paddy Procurement Review | ధాన్యం కొనుగోళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మే నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా విజయవంతంగా నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులకు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి.
Paddy Procurement Review | పొద్దు తిరుగుడు కొనుగోళ్లపై..
ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన సన్ఫ్లవర్ (Sun Flower) పంట కొనుగోళ్లకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా గ్రామాల్లో రైతులు పంట అవశేషాలను (వరి కొయ్యలను) కాల్చకుండా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా వరికొయ్యలను కాల్చారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : RTC Bus CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు


