Paddy Procurement Review | నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Review | ధాన్యం కొనుగోళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్​, అడ్లూరి లక్ష్మణ్​ పాల్గొన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మే నెలాఖరులోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను అనేక సవాళ్ల మధ్య కూడా విజయవంతంగా నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో రైతులకు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బుల చెల్లింపులు జరుగుతున్నాయి.

Paddy Procurement Review | పొద్దు తిరుగుడు కొనుగోళ్లపై..

ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన సన్‌ఫ్లవర్ (Sun Flower) పంట కొనుగోళ్లకు తక్షణమే అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా గ్రామాల్లో రైతులు పంట అవశేషాలను (వరి కొయ్యలను) కాల్చకుండా రాబోయే 15 నుంచి 30 రోజుల పాటు విస్తృత అవగాహన కల్పించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే 50 శాతానికి పైగా వరికొయ్యలను కాల్చారు. వీడియో కాన్ఫరెన్స్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : RTC Bus CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *