అక్షరటుడే, భీమ్గల్: Pallikonda Theft Case | దొంగలు హల్చల్ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలోని ఓ ఇంట్లో చొరబడిన దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు. బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.
Pallikonda Theft Case | బంగ్లాపై నిద్రిస్తుండగా..
భీమ్గల్(Bheemgal) ఎస్సై తిరుపతి (Bheemgal Police) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తెడ్డుబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి మేడపై నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో కిందికి వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు.
లోపలికి వెళ్లి చూడగా సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి. బెడ్రూమ్లోని బీరువాను పగులగొట్టిన దుండగులు, అందులోని 5 తులాల బంగారు ఉంగరాలు, గొలుసులు, చెవి కమ్మలు, మాటీలు, వెండి పాద సరాలతో పాటు ఇతర ఆభరణాలను దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్టీం (Clues Team) వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

