అక్షరటుడే, వెబ్డెస్క్: PCB Chairman | తెలంగాణ (Telangana) పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్కడి రాజశేఖర్రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
కాలుష్య నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎస్ ఛైర్మన్, సభ్యులను నియమించారు. పర్యావరణ పరిరక్షణలో రాజా శేఖర్ రెడ్డికి ఉన్న విశేష పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆయనను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఛైర్మన్గా నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Sridhar Babu Comments | సభను శాసించడానికి మీరెవరు?.. హరీష్ రావుపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం