అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PDSU Protest | ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని (Nizamabad) పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief)ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.
PDSU Protest | బకాయిలు విడుదల చేయాలి
నగరంలోని నాల్గో టౌన్ పరిధిలోని బస్వా గార్డెన్ సమీపంలో ఉన్న పీసీసీ చీఫ్ ఇంటికి పీడీఎస్యూ నాయకులు చేరుకున్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న నాల్గో టౌన్ పోలీసులు వెంటనే స్పందించారు. పీడీఎస్యూ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: AP DSC Recruitment 2026 | అసెంబ్లీలో నారా లోకేశ్ కీలక ప్రకటన