అక్షరటుడే, కామారెడ్డి : Pension Fraud Complaint | పేద ప్రజల వద్ద ఎవరైనా దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయం (Municipal Office)లో ఫిర్యాదు చేయాలని ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Pension Fraud Complaint | పారదర్శకంగా ఎంపిక..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసే సమయంలో దళారుల బారినపడి మోసపోవద్దని కోరారు. పింఛన్ల పంపిణీకి ఎలాంటి దళారులు అవసరం లేదని, కేవలం అర్హులైన వారికే పింఛన్ నేరుగా వారి ఖాతాలోకి జమ అవుతుందని, అధికారులు ఇంటికి వచ్చి ఆన్లైన్ ఫోటో వెరిఫికేషన్ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు ఆశిస్తే వారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లేనని, పేద ప్రజల పొట్టగొట్టి ప్రభుత్వ పథకాలతో వ్యాపారం చేసే ఏ దళారీని, మధ్యవర్తిని కూడా క్షమించబోమని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి..: State Level Softball Competitions | రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ముచ్కూర్ విద్యార్థిని ఎంపిక