అక్షరటుడే, ఇందూరు: School Reopening | ఉమ్మడిజిల్లాలో (Nizamabad) పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలు పూర్తి ఏర్పాట్లు చేశాయి. విద్యార్థులు ఉత్సాహంగా బడులకు వెళ్లారు.
School Reopening | ఉత్సాహంగా వెళ్లిన విద్యార్థులు..
దాదాపు రెండు నెలల సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా స్కూళ్లకు వెళ్లారు. ఇన్నాళ్లు తమ ఇళ్లల్లో ఆడిపాడిన చిన్నారులు.. పాఠశాలల్లో తమ స్నేహితులను కలుసుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉదయాన్నే సమయానికి బడులకు చేరుకున్నారు. తమ స్నేహితులతో ముచ్చటించారు. మొదటి రోజు నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో (government school) మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

School Reopening | అమావాస్య ఎఫెక్ట్..
అయితే పాఠశాలల పునఃప్రారంభానికి అమావాస్య కొద్దిమేర ఎఫెక్ట్ చూపించింది. చాలావరకు ప్రైవేట్ పాఠశాలల్లో అమావాస్య కారణంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. కొత్త అడ్మిషన్లు కూడా జరగలేదు. ప్రభుత్వ పాఠశాల్లోనూ హాజరు అంతంతమాత్రంగానే కనిపించింది. రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతారని విద్యాశాఖ(Department of Education) అధికారి తెలిపారు.

ఇది కూడా చదవండి: K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఫిర్యాదు