అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: POCSO Court PP | పొక్సో కోర్టు, మహిళా కోర్టు ఇన్ఛార్జి పీపీగా (public prosecutor) నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా కోర్టు (Nizamabad First Additional District Court) పీపీ జి నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్(Director of Prosecutions) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
POCSO Court PP | రాష్ట్రవ్యాప్తంగా..
బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన పీపీలను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో ఇన్ఛార్జి పీపీలుగా కొందరికి అవకాశం ఇచ్చారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వేసి కొత్తవారిని నియమించనున్నారు.
ఈ సందర్భంగా మహిళా కోర్టు (Women’s Court) పీపీగా ఉన్న బంటు వసంత్ను, పొక్సోకోర్టు (POCSO Court) పీపీగా ఉన్న ఎం రాజారెడ్డిని తొలగించారు. అలాగే ఆర్మూర్లో(Armoor) పీపీగా ఉన్న ఖాందేశ్ శ్రీనివాస్ స్థానంలో నిజామాబాద్కు చెందిన సీనియర్ సివిల్కోర్టు పీపీఆర్ఎస్ఎల్ గౌడ్కు ఇన్ఛార్జి పీపీగా నియమించారు.
ఈ సందర్భంగా నర్సింహారెడ్డి, ఎల్ఎస్ గౌడ్ల నియామకం పట్ల మాజీ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి, రెంజర్ల సురేష్, రాజు, గణేష్ తదితరులు అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana PRC | పీఆర్సీపై త్వరలో నిర్ణయం : సీఎం రేవంత్రెడ్డి

