అక్షరటుడే, నెట్వర్క్: Hit and run case | కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్దామనుకున్న ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్లో దుబాయ్ వెళ్లేందుకు (dubai travel issue) ప్రయత్నించిన అతడిని అడ్డుకున్నారు.
Hit and run case | మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు..
జూబ్లీహిల్స్ (jubilee hills) హిట్ అండ్ రన్ కేసులో (hit and run case) బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former Bodhan MLA Shakeel) కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్న షకీల్ కుమారుడు దుబాయ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్కు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టు అనుమతి లేకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ దుబాయ్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని సంప్రదించారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఇండియా దాటి వెళ్లరాదని అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

