నిజామాబాద్Paddy Procurement Protest | రోడ్డెక్కిన అన్నదాతలు.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

Paddy Procurement Protest | రోడ్డెక్కిన అన్నదాతలు.. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్​పల్లిలో చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి/ఆర్మూర్​: Paddy Procurement Protest | ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా అనుకున్నంత స్థాయిలో కొనుగోళ్లు (grain purchase delay) జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల (paddy procurement) వద్ద నిరీక్షిస్తున్నారు. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను కోరుతున్నారు.

Paddy Procurement Protest | కామారెడ్డి మండలం తిమ్మాపూర్​లో..

తాజాగా కోతలు కోసి నెలరోజులు గడుస్తున్నా కొనుగోలు చేపట్టడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కామారెడ్డి (kamareddy) మండలం తిమ్మక్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఐకేపీ సిబ్బంది గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. దాంతో నెల రోజులుగా ఎదురు చూస్తున్నా పట్టించుకోకపోవడంపై రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో రైతులు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఎండలో సతమతం అవుతుంటే అధికారులు పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంటాలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రం వద్దకు డీఆర్డీఏ పీడీ సురేందర్ చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజులలో కాంటాలు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Paddy Procurement Protest | ఆర్మూర్​లో రైతుల ఆందోళన

ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్​ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) పరిధిలోని పెర్కిట్ (perkit) రహదారిపై శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 20 రోజులుగా రోడ్లపై ఎండపోసిన ధాన్యం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుందన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, క్వింటాలు ధాన్యానికి 15 కిలోల కడ్తా తీస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. తక్షణమే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు నాయకులు నచ్చు చిన్నారెడ్డి, అల్లూరు గంగారెడ్డి, పాలెపు రాజు, రవి రెడ్డి, మోహన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

team

ఆర్మూర్​లోని పెర్కిట్​ వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు

ఇది కూడా చదవండి: Balakonda suicide attempt | ప్రియుడు మోసం చేశాడని మనస్తాపం.. పోలీస్​ స్టేషన్​ పైనుంచి దూకిన యువతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...

 Kavitha Political Statement | కాంగ్రెస్​ను గద్దె దించుతాం.. టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Political Statement | కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని...