Rahul Gandhi Debate | చర్చ నుంచి పారిపోతున్న రాహుల్​ గాంధీ : బీజేపీ ఎంపీలు

విద్యార్థుల నిరసనల అంశంపై చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నప్పటికీ, రాహుల్​ గాంధీ పారిపోతున్నారని బీజేపీ ఎంపీలు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rahul Gandhi Debate | విద్యార్థుల నిరసనల అంశంపై చర్చకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు వెనకాడుతున్నాయని ఎన్​డీఏ ఎంపీలు ఆరోపించారు. ఈ మేరకు పార్లమెంట్​ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు.

బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. జార్ఖండ్ యువతకు న్యాయం జరగాలని డిమాండ్​ చేశారు. వారిపై జరిగిన లాఠీచార్జీలు, అరాచకాలు రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని బయటపెట్టాయన్నారు. ఆయన మద్దతుదారులు పాలించే రాష్ట్రంలో యువత పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, వారికి ఎలా న్యాయం నిరాకరించబడుతోందో ఇది చూపిస్తుందన్నారు. మరోవైపు స్వయంగా సభకు హాజరుకాని రాహుల్ గాంధీ హోం మంత్రిని సమాధానాలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Rahul Gandhi Debate | చర్చకు సిద్ధంగా ఉన్నాం

బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ మాట్లాడుతూ.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ ప్రతిపక్ష ఎంపీలు దాని నుండి పారిపోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీపై రాహుల్​గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతూ.. అమిత్ షా సమాధానం ఇస్తారని, రాహుల్ గాంధీ పారిపోవద్దని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: FCRA Bills | నీట్​, ఎఫ్​సీఆర్​ఏ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *