అక్షర్ టుడే, నందిపేట్: PDS Rice Seized | నందిపేట మండల (Nandipet Mandal) పరిధిలోని ఆంధ్రనగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని పట్టుకున్నట్లు నందిపేట ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి సమాచారం వెల్లడించారు.
PDS Rice Seized | విశ్వసనీయ సమాచారం మేరకు..
విశ్వసనీయ సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఆంధ్రనగర్ వద్ద ఒక బొలెరో వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 51 బ్యాగులలోని 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని, వాహనాన్ని నందిపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహన డ్రైవర్ కలీంతో పాటు, మాక్లూర్ గ్రామానికి చెందిన వాహన యజమాని ఇమ్రాన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Drone Surveillance | డ్రోన్ నిఘా.. అనుమానాస్పద ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి