అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ranjan Ratan Kumar | సామాన్య కుటుంబంలో పుట్టి ఎస్సై స్థాయి నుంచి డీసీపీ వరకు ఎదిగిన ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణవాసి జొన్నలగడ్డ రంజన్ రతన్ కుమార్ పదవీవిరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Ranjan Ratan Kumar | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో..
ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad Commissionerate) పరిధిలో ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్న రంజన్ రతన్ కుమార్ ఈ నెలాఖరుతో 37 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటారు. దీంతో పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన బాల్య మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పాల్గొని సన్మానించారు. అనంతరం డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టినా.. పోలీస్ ఉద్యోగం చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగానన్నారు.
తన 37 ఏళ్ల సర్వీసులో నిస్వార్ధంగా విధులు నిర్వహించానని.. తాను పుట్టిన ఎల్లారెడ్డి గడ్డ మీద పదవీ విరమణ సభ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎంతో మంది విద్యార్థులకు తన వంతుగా సహాయం చేశానని గుర్తు చేసుకున్నారు. దృఢ నిశ్చయంతో విధులు నిర్వహించానని, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో రొడ్డ ప్రభాకర్, సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ సంజీవరావు, డీసీపీ రంజన్ రతన్ కుమార్ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Disabled Welfare | దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..: మంత్రి సీతక్క

