అక్షరటుడే, కామారెడ్డి: Red Cross Membership | యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(collector ashish sangwan) పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో (red cross membership) ఆర్కే విద్యాసంస్థల సీఈవో, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైపాల్ రెడ్డి రూ.25 వేలతో పాట్రన్ మెంబర్గా చేరారు. ఈ సందర్భంగా శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయనను శాలువాతో సత్కరించి సభ్యత్వ ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Red Cross Membership | వైస్ పాట్రన్గా సదాశివరెడ్డి..
అదే కార్యక్రమంలో ఎం.సదాశివ రెడ్డి రూ.12 వేలతో వైస్ పాట్రన్ సభ్యత్వం తీసుకోగా కలెక్టర్ మెమెంటో అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ వంటి సంస్థలో(indian red cross) ప్రముఖులు చేరడం అభినందనీయమని, జిల్లా యువత సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. డా.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్క్రాస్ ద్వారా మరింత విస్తృతంగా ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందని, ప్రముఖులు, యువత, విద్యార్థులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గిరి, రెడ్ క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, దత్తాద్రి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Caste Names Change | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కులాల పేర్లు మార్పు


