అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్ : Rice Mill Raid | జిల్లాలో నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని రైస్మిల్లులపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (స్థానికసంస్థలు) భుజంగరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైస్మిల్పై దాడిచేయగా వివరాలు వెల్లడించారు.
Rice Mill Raid | సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్లో తనిఖీలు

ఈ క్రమంలో నగర శివారులోని సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారని అదనపు కలెక్టర్ తెలిపారు. సదరు రైస్మిల్ (Rice Mill) నిర్వాహకులు 3,15,970.6 క్వింటాళ్ల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా.. రైస్మిల్లులో 1,12,282.40 క్వింటాళ్లు ధాన్యం మాత్రమే ఉందని.. మిగిలిన బియ్యంపై లెక్కలు లేవన్నారు. ఈ సందర్భంగా సదరు రైస్మిల్పై నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు లేదా రికవరీ కోసం ఆదేశాలు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: CPS Employees Rally | నిజామాబాద్కు చేరిన ఉద్యోగుల ‘జన జాగరణ యాత్ర’..