అక్షరటుడే, కామారెడ్డి: Water Conservation | వర్షం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు చెరువులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environment Day) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో డీఎంఎఫ్(టి) నిధులు రూ.6.55 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెరువును ప్రారంభించారు.

Water Conservation | పరిశుభ్రత పాటించాలి
కలెక్టర్ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చెరువు చుట్టూ పరిశుభ్రత పాటించాలని, పచ్చదనంతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని (Rainwater Harvesting) సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Miryalaguda Cylinder Blast | సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం
