అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nagesh Reddy Warning | రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిందని..అనవసరంగా పీసీసీ చీఫ్పై నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Nagesh Reddy Warning | నీ చరిత్ర అందరికీ తెలుసు..
నగేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్ ప్రజలకు రాకేష్ రెడ్డి (Rakesh Reddy) చరిత్ర మొత్తం తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారని ఆయన పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని రాకేష్ రెడ్డికి హితవు పలికారు. ఆయన తాత ముత్తాతల కాలం నుండి భూస్వాములుగా ఉన్నారన్నారు. స్వయంగా వారే 12 ఎకరాలు దానం చేశారని తెలిపారు.
Nagesh Reddy Warning | రాజీనామా చేయాలి
రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారని.. ఆయన వెంటనే రాజీమానా చేస్తా తాము కూడా సిద్ధంగా ఉన్నామని నగేష్రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ ప్రజలే ఆయనను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తన సీటు కాపాడుకోవడానికి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాకేష్ రెడ్డి నీట్ పరీక్ష గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాట తప్పదన్నారు.
Nagesh Reddy Warning | ఆర్మూర్ జంబి హనుమాన్ సాక్షిగా రాజీనామా చేయాలి..
అనంతరం గాంధీభవన్ అధికార ప్రతినిధి ఏబీ చిన్నా మాట్లాడుతూ.. ఆర్మూర్ జంబి హనుమాన్ సాక్షిగా రాకేష్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ దందా చేస్తూ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మహేష్ కుమార్ను విమర్శించడం కరెక్ట్ కాదన్నారు. పీసీసీ చీఫ్ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని.. దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చేసి ప్రజల మధ్య నిలబడాలన్నారు. కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Dharmapuri Arvind Students | గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు.. అంతర్జాతీయ వేదికపైకి అడుగులు.. ఛాంపియన్లను అభినందించిన ఎంపీ ధర్మపురి అర్వింద్