అక్షరటుడే, కామారెడ్డి : RTC Bus Stuck | భారీ వర్షాలతో జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. తాజాగా కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ రోడ్డుపై ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనున్న మట్టిలో కూరుకుపోయిన( Heavy Rains) ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.
RTC Bus Stuck | అడ్లూర్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా..
కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి బుధవారం గిద్ద గ్రామం మీదుగా పోసానిపేట్, గోకుల్ తండా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం అడ్లూర్ రోడ్డుపై ప్రయాణిస్తోంది. ఎదురుగా వస్తున్న వాహనాలకు దారి ఇవ్వడానికి డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తీయడంతో టైర్లు బురదలో ఇరుక్కుపోయాయి. డ్రైవర్ బయటకు తీసే ప్రయత్నంలో బస్సు మరింతగా బురదలోకి దిగి ఒకవైపు ఒరిగింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనపై స్థానికులు, వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు ఇరువైపులా మొరం వేయకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, వర్షాకాలంలో ఇది ప్రమాదాలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు ఇరువైపులా మొరం వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి : Annapurna Studios’ #Pallaburusu Teaser Out Now.