అక్షరటుడే, కామారెడ్డి: Tractor Overturn Accident | ఇటుక లోడ్ ఖాళీ చేసి తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాల్వంచ మండలం (Palvancha Mandal) పోతారం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
Tractor Overturn Accident | పాల్వంచ మండలం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం పోతారం గ్రామంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కూలీలు ఇటుక అన్లోడ్ చేసి తిరిగి పాల్వంచ వైపు వస్తున్నారు. తిరిగి వస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రానికి చెందిన రాయ్ సింగ్(30) ఎముకలు విరిగి మృతి చెందాడు. పాల్వంచకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు, ఒడిశాకు చెందిన కూలీ దేవకుమార్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Journalists Arrest | జర్నలిస్టుల అరెస్ట్.. ఐ అండ్ పీఆర్ కమిషనరేట్కు వెళ్లకుండా కట్టడి