అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RTC Digital Services | ఆర్టీసీ (TGSRTC) నిజామాబాద్ రీజియన్ (RTC Nizamabad Region) పరిధిలోని బస్టాండ్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఆన్లైన్ పేమెంట్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
RTC Digital Services | చిల్లర సమస్య తగ్గించేందుకే..
రీజియన్లోని అన్ని డిపోల్లో డిజిటల్ పేమెంట్ సౌకర్యం (TSRTC Online Payment) కల్పించినట్లు ఆర్ఎం తెలిపారు. దీంతో కౌంటర్ల వద్ద చిల్లర నగదు సమస్య తగ్గడంతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. టికెట్ బుకింగ్తో పాటు బస్పాస్ సేవలకు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేసే అవకాశం కల్పించామన్నారు. నగదు చెల్లింపులతో పాటు గూగుల్ పే (Google pay), ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా టికెట్లు పొందవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Parle Industries | మెలోనికి ‘మెలోడీ’ ఇచ్చిన మోదీ.. పార్లే అనుకుని.. పార్లేను కొన్న ఇన్వెస్టర్లు!


