అక్షరటుడే, వెబ్డెస్క్ : Scholarship Deadline | తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన లక్షలాది మంది విద్యార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఈ-పాస్ (E pass) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశాన్ని కల్పించింది.
దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పొడిగింపు కొత్త దరఖాస్తులతో పాటు, రెన్యువల్ చేసుకునే అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే 10.20 లక్షలకు పైగా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, వివిధ కారణాల వల్ల దాదాపు 70 వేల మంది విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. దీంతో తాజాగా ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Scholarship Deadline | సాంకేతిక సమస్యలతో..
గత ఏడాది నమోదులతో పోలిస్తే 68,597 మంది విద్యార్థులు స్కాలర్షిప్కు తక్కువగా దరఖాస్తు చేస్తున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఈ విద్యార్థులు గడువు తేదీలోగా తమ దరఖాస్తును నమోదు చేసుకోలేకపోయారు. ఏప్రిల్ మొదటి వారంలో మీ-సేవా పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
దీనిని కూడా చదవండి : NEET Paper Leak | నీట్ పేపర్ లీకేజీ.. ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం


