School Pending Works | బడుల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయించాలి: సుదర్శన్​ రెడ్డి

ప్రభుత్వ విద్యాసంస్థలలో పెండింగ్​ పనులను పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: School Pending Works | ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చేందుకు వీలుగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సూచించారు. కలెక్టరేట్​లో కలెక్టర్ భవేష్ మిశ్రాతో(Collector Bhavesh Mishra) కలిసి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.

School Pending Works | పెండింగ్​ పనులు..

వివిధ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న అసంపూర్తి పనులను గుర్తించి, విద్యార్థులు సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సుదర్శన్​ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా తాగునీరు, టాయిలెట్స్ వంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని, నూటికి నూరు శాతం పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులకు సూచించారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల విషయమై ఉన్నతాధికారులను సంప్రదించి మంజూరు చేయిస్తానని తెలిపారు. అయితే పనులను పూర్తి చేయించే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని హితవు పలికారు.

School Pending Works | మిల్లర్లపై ఆర్​ఆర్​ యాక్ట్​ ప్రయోగించాలి

పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షిస్తూ, డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చేపట్టిన చర్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమంది నుండి ఏమేరకు బకాయిలు రాబట్టగలిగారు. ఇంకా ఎంత మంది సీఎంఆర్​కు సంబంధించిన బకాయిలు చెల్లించేందుకు సముఖంగా ఉన్నారనే వివరాలు తెలుసుకున్నారు. బకాయిలు చెల్లించని మిల్లర్లకు నోటీసులు జారీచేసి, రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పంచాయతీ శాఖ పనితీరును సమీక్షిస్తూ, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం పనులు, తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా రోజువారీగా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ పరిధిలోనూ ఇంటింటి చెత్తను వెంటదివెంట తరలించేందుకు వీలుగా డంపింగ్ యార్డ్ మల్టిపుల్ పాయింట్స్​ను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్​కు సూచించారు. సమీక్ష సమావేశంలో జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీఈవోపీ అశోక్, డీపీవో శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె‌స్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *