Seethamma Sagar | సీతమ్మ సాగర్​ పనులు పూర్తి చేయాలి

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Seethamma Sagar | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బహుళార్థ సాధక బ్యారేజీ, జలవిద్యుత్​కు సంబంధించిన సీతమ్మసాగర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్​ కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్​ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్​ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Seethamma Sagar | రైతులకు అంకితం చేయాలి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా రైతాంగం ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ప్రాజెక్టు సీతమ్మసాగర్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి పర్యావరణ అనుమతులు కూడా లభించాయని తెలిపారు. గడువులోపు ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : POCSO Case Nizamabad | ​బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి 12 ఏళ్ల జైలుశిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *