బిజినెస్​Stock Market Selloff | స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ.. మండే రోజూ నష్టాలతో ముగిసిన...

Stock Market Selloff | స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ.. మండే రోజూ నష్టాలతో ముగిసిన సూచీలు

జియో పొలిటికల్ టెన్షన్స్, ఆర్థిక సంక్షోభ భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురయ్యింది. సెన్సెక్స్ 1,312 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Selloff | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొస్తున్నాయి. దీనికితోడు ఆదివారం హైదరాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చేసిన ప్రసంగం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.

ప్రధాని ఇచ్చిన పొదుపు పిలుపుతో కోవిడ్ నాటి పరిస్థితులు తిరిగి తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మÖడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిశాయి.

Stock Market Selloff | తీవ్ర అమ్మకాల ఒత్తిడి..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 690 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 40 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మరో 721 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 206 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 198 పాయింట్లు పతనమైంది. ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపించినా.. చివరి గంటన్నరలో తిరిగి సెల్లాఫ్ నకు గురయ్యింది. చివరికి సెన్సెక్స్ 1,312 పాయింట్ల నష్టంతో 76,015 వద్ద, నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో 23,815 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Selloff | ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా..

ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ (Nifty) ఫార్మా ఇండెక్స్ 0.25 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.88 శాతం పెరిగాయి. నిఫ్టీలో కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 3.76 శాతం, రియాలిటీ 3.05 శాతం, మీడియా 2.49 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.24 శాతం, పవర్ 2.13 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.09 శాతం, ఆటో 1.86 శాతం, ఎనర్జీ 1.85 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.57 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.49 శాతం నష్టాలతో ముగిశాయి.

Stock Market Selloff | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,457 కంపెనీలు లాభపడగా 2,892 స్టాక్స్ నష్టపోయాయి. 189 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 198 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 24 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 6 లక్షల కోట్ల మేర ఆవిరయ్యింది.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో, 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 1.36 శాతం, హెచ్యూఎల్ 0.85 శాతం, అదానీపోర్ట్స్ 043 శాతం, కొటక్ బ్యాంక్ 0.14 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.13 శాతం లాభపడ్డాయి.

Top Losers : టైటాన్ 6.83 శాతం, ఇండిగో 4.69 శాతం, ఎస్ బీఐ 4.52 శాతం, ఎయిర్‌టెల్ 4.18 శాతం, ఎటర్నల్ 4.08 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | ఆర్థిక సంక్షోభ భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sand Transport Rules | ఇసుక రవాణాలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sand Transport Rules | ఇసుక రవాణా...

Ex Mla Jajala | బండి సంజయ్​ను బర్తరఫ్​ చేయాలి: మాజీ ఎమ్మెల్యే జాజాల

అక్షరటుడే, గాంధారి: Ex Mla Jajala | కేంద్ర మంత్రి పదవి...

Work From Home | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!.. మార్గదర్శకాలు విడుదల చేయాలంటున్న ఎన్ఐటీఈఎస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Work From Home | ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...

TRS Flag Festival | మే 20 నుంచి టీఆర్​ఎస్​ జెండా పండుగలు : కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRS Flag Festival | తెలంగాణ (Telangana)...