అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Advisors | తెలంగాణ (Telangana)లో సలహాదారుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రభుత్వం పలువురు నేతలు, రిటైర్డ్ అధికారులకు అడ్వైజర్ పోస్టులను కట్టబెడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో సలహాదారుల నియామకంతో ఖాజానాపై తీవ్ర భారం పడుతోంది. మంత్రి, ఇతర పదువులు ఆశించి భంగపడ్డ వారిని కేబినెట్ హోదాతో ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తుండటం గమనార్హం. అయితే వీరు ఎం సలహాలు ఇస్తారు.. వాటిని ఎవరు స్వీకరిస్తారని విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govrnment) మరో ఇద్దరు కీలక వ్యక్తులకు సలహాదారుల పదవులను కట్టబెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో (వీహెచ్) పాటు, తాజాగా డీజీపీగా పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి బత్తుల శివధర్ రెడ్డి (Sivadhar Reddy)కి నూతన బాధ్యతలు అప్పగించింది. గత ప్రభుత్వ బాటలోనే రిటైర్డ్ అధికారులకు, రాజకీయ నేతలకు వరసపెట్టి ‘సలహాదారు’ పదవులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana Advisors | వీహెచ్కు పదవి
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ను బీసీ సంక్షేమ సలహాదారుగా నియమించిన ప్రభుత్వం, ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించింది. అలాగే ఈరోజే డీజీపీగా రిటైర్ అయిన శివధర్ రెడ్డిని మూడు ఏళ్ల పాటు భద్రతా సలహాదారుగా నియమించడం చర్చనీయాంశమైంది. 32 ఏళ్ల సర్వీసు ముగిసిన వెంటనే ఆయనకు మళ్ళీ ప్రభుత్వ కారు, బంగ్లా, భారీ సిబ్బందిని కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై “రిటైర్డ్ అధికారులకు ఇది పునరావాస కేంద్రంగా మారిందా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Telangana Advisors | ఇష్టానుసారంగా పదవులు
బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 మందికి పైగా సలహాదారులు ఉండేవారు. అప్పట్లో ప్రతిపక్షాలు దీనిని “నిరుద్యోగ అధికారుల పునరావాస కేంద్రం”గా అభివర్ణించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం సలహాదారులను నియమించినప్పుడు “ఖజానా దోపిడీ” అని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది.
Telangana Advisors | ఎంత మంది ఉన్నారంటే..
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 10 మందికి పైగా సలహాదారులను నియమించింది. వీరిలో వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), షబ్బీర్ అలీ (సంక్షేమం), హర్కర వేణుగోపాల్ (ప్రోటోకాల్), మల్లు రవి (ఢిల్లీ ప్రతినిధి), ఆదిత్య నాథ్ దాస్ (నీటి వనరులు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (వ్యవసాయం), సుదర్శన్రెడ్డి (సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు) ఉన్నారు. ఇప్పుడు వీహెచ్, శివధర్ రెడ్డి ఈ జాబితాలో చేరారు.
Telangana Advisors | రిటైర్డ్ అధికారులకు..
సర్వీసులో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సలహాదారులుగా పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆదిత్య నాథ్ దాస్ (మాజీ ఐఏఎస్), ఇప్పుడు శివధర్ రెడ్డి (మాజీ ఐపీఎస్) వంటి అధికారులకు పదవులు దక్కాయి.
Telangana Advisors | బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి..
సలహాదారుల నియామకంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. గత ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించి, ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరిన కె. కేశవరావు, పోచారం శ్రీనివాస్రెడ్డి వంటి వారికి కూడా సలహాదారు పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డి రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రభుత్వం ఇష్టానుసారంగా సలహాదారుల పోస్టులను పెంచుకుంటూ పోవడం ఖజానాపై భారమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Governor Felicitation Event | తెలంగాణ గవర్నర్ను సన్మానించిన ఎంపీ అర్వింద్


[…] […]
[…] […]
[…] […]
[…] […]
[…] […]