అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Voter Revision | తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ప్రకటన చేసింది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు, క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
Telangana Voter Revision | పొడిగింపునకు కారణం
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారాలు కూడా అందలేదని గుర్తించడంతో, ఈ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను జారీ చేసింది.
Telangana Voter Revision | ప్రక్రియలో కీలక తేదీలు..
బూత్ స్థాయి అధికారులు జూన్ 25న ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు కొనసాగుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత, ఆగస్టు 10న అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను (Draft Publication) అధికారికంగా విడుదల చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదుతో పాటు, ఉన్న ఓటర్ల వివరాల్లో మార్పులు-చేర్పులు చేసుకోవడానికి, అలాగే అభ్యంతరాలను (Claims & Objections) తెలియజేయడానికి ప్రజలకు నెల రోజుల గడువు ఉంటుంది. ఇలా వచ్చిన విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే ప్రక్రియను ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు పూర్తి చేస్తారు. చివరగా, అన్ని అభ్యంతరాలు , దరఖాస్తుల పరిష్కారం తర్వాత, అక్టోబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటర్ల జాబితాను (Final Publication) అధికారికంగా ప్రకటించనున్నారు.
BREAKING NEWS : ‘SIR’ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటరు లిస్టు సంబంధించి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును ఈసీ పొడిగించింది. ఈనెల 24 వరకు ఉన్న గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తూ స్టేట్ ఎలక్టోరియల్ ఆఫీసర్ కు ఉత్తర్వులు పంపించింది.
EC Extends SIR Deadline in Telangana… pic.twitter.com/Er8MXa93Iu
— Akshara Today | Telugu News (@aksharatoday) July 15, 2026
ఇది కూడా చదవండి: Swiggy LPG Delivery | స్విగ్గీ ఇన్స్టామార్ట్ సరికొత్త సేవలు.. నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్