అక్షరటుడే, వెబ్డెస్క్: Tirumala Car Accident | తిరుమల నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన మొదటి ఘాట్రోడ్డులోని 22వ హెయిర్పిన్ బెండ్ సమీపంలో చోటుచేసుకుంది.
Tirumala Car Accident | నిద్రమత్తే కారణమా,,
ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో కారు సుమారు 15 అడుగుల లోతులోకి దూసుకెళ్లింది.
కారులో బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఒక భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు సహా మరో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్కు నిద్రమత్తు రావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.