Tummidihetti Barrage | కేంద్ర జల్‌శక్తి మంత్రితో రేవంత్ రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై కీలక చర్చ

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tummidihetti Barrage | దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ఎత్తు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Tummidihetti Barrage | 150 మీటర్ల ఎత్తుతో ప్రయోజనాలు..

గతంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దీనిని 150 మీటర్లకు పెంచేలా మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు. బ్యారేజీ ఎత్తును 150 మీటర్లకు పెంచినప్పటికీ ముంపు ప్రాంతం కేవలం 1,000 హెక్టార్ల లోపే ఉంటుందని వివరించారు. ఈ ఎత్తుతో ప్రాజెక్టును నిర్మిస్తే విద్యుత్ వినియోగంతో పనిలేకుండా, ఎలాంటి లిఫ్ట్‌ల అవసరం లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే నీటిని నిరాటంకంగా తరలించవచ్చని సీఆర్ పాటిల్‌కు సీఎం స్పష్టం చేశారు.

 

ఇది కూడా చదవండి: POCO M8 Power 5G | భారీ బ్యాటరీతో పోకో ఫోన్ విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *