Vana Mahotsavam 2026 | వన మహోత్సవం ప్రారంభించిన సీఎం

వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఆయన మొక్కలు నాటారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vana Mahotsavam 2026 | రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో జరుగుతున్న “వనమహోత్సవం – 2026” గ్రాండ్ లాంచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు . హరితహారం స్ఫూర్తితో అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గుర్రంగూడ అర్బన్ పార్క్‌లో నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవం–2026 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సి. సువర్ణ పాల్గొన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వనమహోత్సవం–2026 కార్యక్రమాలకు ఈ వేడుక నాంది పలికింది.

Vana Mahotsavam 2026 | రాష్ట్రవ్యాప్తంగా..

రాష్ట్రవ్యాప్తంగా నేడు వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటనున్నారు. హరిత తెలంగాణే లక్ష్యంగా బీఆర్​ఎస్​ హయాంలో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. హరితహారం పేరిట గతంలో అమలు చేసిన పథకాన్ని కాంగ్రెస్​ వన మహోత్సవంగా మార్చింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మొక్కలు నాటేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా శాఖలకు లక్ష్యం విధించింది.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్​డేట్​.. 30న నిధులు విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *