అక్షరటుడే, వెబ్డెస్క్ : Visakha Steel Plant Accident | విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 1500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతున్న ఉక్కు మీద పడటంతో 8 మంది కార్మికులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మంగళవారం ఉదయం పరామర్శించారు. విశాఖ కేజీహెచ్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్తో కార్మిక సంఘాల నాయకులు వాగ్వాదం చేశారు. నిర్వాహణ లోపంతో ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. అనంతరం మంత్రి మార్చురీ దగ్గర మృతుల కుటుంబాలను పరామర్శించారు. డబ్బులిచ్చి దులుపుకోవడానికి రాలేదని, బాధితులకు అండగా ఉండడానికే వచ్చామన్నారు.
Visakha Steel Plant Accident | డీఎన్ఏ పరీక్ష చేశాకే..
ప్రమాదంలో వేడి తీవ్రతకు మృతదేహాలు గుర్తు పట్టలేకుండా మారాయి. దీంతో డీఎన్ఏ పరీక్షలు చేసి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సైతం విశాఖకు రానున్నారు. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, అధికారులతో భేటీ కానున్నారు.
Visakha Steel Plant Accident | రూ.25 లక్షల పరిహారం
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి బాధితులను పరామర్శించారు. ఆయన ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Godavari River Pollution | కళ్లెదుటే గోదావరి కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారు?.. అధికారులను నిలదీసిన పవన్ కళ్యాణ్
