Fake Seeds | నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Fake Seeds | ఖరీఫ్ సీజన్​ను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో నకిలీ విత్తనాలు చలామణి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్ హాల్​లో సోమవారం వ్యవసాయ(Nizamabad Agriculture), ఉద్యానవన శాఖ అధికారులతో పాటు ఎరువులు విత్తనాల డీలర్లు, రైస్ మిల్లర్లతో(Rice Millers) కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు.

Fake Seeds | విత్తనాలు అందుబాటులో ఉంచాలి

ఖరీఫ్ పంటల (Kharif Season) సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అయితే నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల ద్వారా మార్కెట్లో చలామణి అయ్యే అన్ని రకాల విత్తనాలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనే పదం వినిపించకూడదని, ఈ విషయంలో అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు నకిలీ విత్తనాల బెడద లేకుండా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలన్నారు.

Fake Seeds | లైసెన్స్​లు రద్దు చేస్తాం

ఎవరైనా నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని, కేసులు నమోదు చేసి రికవరీ యాక్ట్(Recovery Act)​ అమలు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. డీలర్లను ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకూడదన్న సంకల్పంతో ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తనిఖీకి వచ్చే అధికారులకు సహకరించాలని డీలర్లకు సూచించారు. జిల్లాకు వ్యవసాయ రంగంలో మంచి పేరు ఉందని, దానిని నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

క్షేత్రస్థాయిలో ఎరువులు విత్తనాల దుకాణాలలో తనిఖీలు నిర్వహించిన వివరాలను నివేదిక రూపంలో తనకు ఎప్పటికప్పుడు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్రాప్ బుకింగ్ ఫార్మర్ రిజిస్ట్రీ (Crop Booking Farmer Registry) విషయంలోనూ ఖచ్చితత్వంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. లేనిపక్షంలో పంట సేకరణ సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యవసాయ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీఎస్​వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయిస్​ డీఎం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

affi

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *