అక్షరటుడే, డిచ్పల్లి: Lorry Accident | జాతీయ రహదారిపై (National Highway) లారీ బీభత్సం సృష్టించింది. వరుసగా ఏడు కార్లను ఢీకొట్టింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai Police Station) పరిధిలోని చంద్రాయన్పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఈ ఘటను చూసిన స్థానికులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Lorry Accident | కార్లు ధ్వంసం
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) వైపు నుంచి నిజామాబాద్ (Nizamabad) వస్తున్న ఓ లారీ చంద్రాయన్పల్లి (Chandrayanpally) వద్ద ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఆ లారీ వెనక ఉన్న సుమారు ఏడు కార్లు కూడా స్లో అయ్యాయి. అయితే ఈ కార్ల వెనక ఉన్న ఎరువుల లారీ మాత్రం వేగాన్ని అదుపు చేయలేక ఈ ఏడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు సైతం ఒకదానికొకటి ఢీకొని కొంతదూరం వరకు నెట్టుకెళ్లాయి. ఈ ఘటనలో పలు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు స్పందించి 108కు సమాచారం ఇవ్వగా స్పందించిన వారు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad GGH) తరలించారు. కార్లలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు.

ఇది కూడా చదవండి: AIADMK MLAs Resign|తమిళనాడులో పొలిటికల్ సంచలనం.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా


