అక్షరటుడే, ఇందూరు: Akshaya Tritiya | అక్షయ తృతీయ సందర్భంగా పర్వదినం నిజామాబాద్ జిల్లాలోని ఆలయాల్లో సందడి నెలకొంది. నగరంలోని ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం భక్తులు విశేష పూజలు చేశారు.
Akshaya Tritiya | నగరంలోని కంఠేశ్వరాలయంలో..
జిల్లా కేంద్రంలోని (Nizamabad City) కంఠేశ్వరాలయంలో (Kanteshwar Temple) ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయంలోని భోళా శంకరుడికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున తమకు అన్ని శుభాలే కలగాలని కోరుతూ భక్తులు పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విపరీతమైన ఎండలు కాస్తున్నందున ఆలయంలో చలువ పందిళ్లు వేయించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. అలాగే అక్షయ తృతీయ రోజు కొంతైనా బంగారం (Gold) కొనాలనే ఉద్దేశంలో పలువురు బంగారం కొనుగోలు చేశారు.


