అక్షరటుడే, వెబ్డెస్క్: Kharge Hyderabad Visit | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.
Kharge Hyderabad Visit | రాజకీయాలపై ఖర్గేతో చర్చ..
ఖర్గే హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మహేశ్ గౌడ్ ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్లో వీరు భేటీ అయ్యారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుల్బర్గాకి ఖర్గే బయలు దేరారు. డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి


