Kharge Hyderabad Visit | ఖర్గేకు ఘన స్వాగతం పలికిన సీఎం, పీసీసీ చీఫ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kharge Hyderabad Visit | కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​ ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

Kharge Hyderabad Visit | రాజకీయాలపై ఖర్గేతో చర్చ..

ఖర్గే హైదరాబాద్ మీదుగా గుల్బర్గా వెళ్తున్నారు. ఆయనకు హైదరాబాద్​లో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. మహేశ్​ గౌడ్​ ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఎయిర్ పోర్టు నోవాటెల్ హోటల్​లో వీరు భేటీ అయ్యారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుల్బర్గాకి ఖర్గే బయలు దేరారు. డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.

Kharge Hyderabad Visit

ఇది కూడా చదవండి..: World No Tobacco Day | పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *