అక్షరటుడే, వెబ్డెస్క్ : Heatwave Relief | వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. గత కొంతకాలంగా మండుతున్న ఎండలు క్రమంగా తగ్గుతాయని పేర్కొంది.
వేసవి ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఎండలు దంచికొట్టాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడపాదడపా అకాల వర్షాలు కురిసినా ఎండలు మాత్రం తగ్గలేదు. అయితే నేటి నుంచి ఎండ తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు. మొన్నటి వరకు 45 డిగ్రిల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలకు పరిమితం కానున్నాయి.
Heatwave Relief | పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ (Nizamabad), జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డిలో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి.
ఇది కూడా చదవండి..: Transport Department Transfers | రవాణా శాఖలో భారీగా బదిలీలు


