అక్షరటుడే, ఎల్లారెడ్డి : Indiramma Housewarming | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో పేదల సొంతింటి కల సాకారమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజు సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) గృహప్రవేశాలు సోమవారం ఘనంగా జరిగాయి.
రామారెడ్డి (Ramareddy) మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ, షేక్ షబీన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madanmohan) పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నాయని తెలిపారు. ఒకే రోజు 700కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.
Indiramma Housewarming | ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్


