అక్షరటుడే, బోధన్: Manjeera Survey | తెలంగాణ (Telangana), మహారాష్ట్ర (Maharashtra) మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు భూ వివాదం నెలకొంది. మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నది నుండి తమ భూ భాగంలో ఇసుక తోడుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే మహారాష్ట్ర ఇసుక క్వారీ నిర్వాహకులు తెలంగాణ భూభాగం నుండి సైతం ఇసుకను తీసుకెళ్లడంతో (Sand Quarry Issue) సరిహద్దు వివాదం తలెత్తింది.
Manjeera Survey | స్పందించని మహారాష్ట్ర అధికారులు
సరిహద్దులో ఇసుక వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సర్వే నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో శుక్రవారం తెలంగాణ రాష్ట్రం నుండి బోధన్ డివిజన్ అధికారులు హాజరయ్యారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం సర్వేకు రాకుండా ముఖం చాటేశారు. సాలూర మండలం హున్సా, మంజీర సరిహద్దుల వద్ద తెలంగాణ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించేందుకు పరికరాలతో సిద్ధమయ్యారు.

Manjeera Survey | ఉదయం నుంచి ఎదురుచూసినా పత్తాలేరు..
ఈ సర్వేలో పాల్గొనాల్సిన మహారాష్ట్ర రెవెన్యూ, సర్వే అధికారుల(Revenue Survey) కోసం తెలంగాణ యంత్రాంగం ఉదయం నుంచి ఎదురుచూసింది. అయితే అటువైపు నుంచి అధికారుల జాడ కనిపించలేదు. ఎలాంటి సమాచారం కూడా లేదు. ఒక పక్క అధికారుల సర్వేకు రంగం సిద్ధమవుతున్నప్పటికీ మహారాష్ట్ర ఇసుక మాఫియా మాత్రం ఏమాత్రం భయం లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని సమాచారం. సర్వే జరుగుతోందన్న విషయాన్ని సైతం ఏమాత్రం లెక్కచేయకుండా వారి భూభాగంలో యథేచ్ఛగా ఇసుకను తవ్వుతున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దుల వద్ద అధికారులు ఉన్నారన్న భయమే లేకుండా రవాణాను ఆపకుండా బహిరంగంగానే ఇసుకను దోచేస్తుండటం గమనార్హం.

ఇది కూడా చదవండి: Ameerpet Fire Accident | అమీర్పేట్ అగ్నిప్రమాదంపై కవిత ఫైర్.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
