అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhatti Vikramarka | విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలకు పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Integrated Residential School) నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.
పనుల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం సిమెంట్, ఇటుకలతో కూడిన భవనాలు కావని, అవి భవిష్యత్తరాలను ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అన్నారు. హాస్టల్స్, జూనియర్, సీనియర్ విభాగాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు.
Bhatti Vikramarka | వేగవంతం చేయాలి

నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు,కాంట్రాక్టర్లను ఆదేశించారు. అట్టడుగు వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి వసతులు, నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Vande Bharat Accident | ట్రాక్పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
