అక్షరటుడే, వెబ్డెస్క్ : Kishan Reddy Counter | సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ.. గతంలో బీఆర్ఎస్ గానీ, ఇప్పుడు కాంగ్రెస్ గానీ ఏ విషయంలోనూ కేంద్రాన్ని సంప్రదించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కుమ్మక్కు అయ్యానంటూ తనపై ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వస్తే కూడా సింగరేణి నిధులు ఖర్చు చేశారని, ఇంటర్నేషనల్ స్కూల్స్కు కూడా సింగరేణి డబ్బులు పెడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఫిల్మ్నగర్ ఎఫ్ఎన్సీసీ (FNCC)లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు రంగం అంటే అవినీతి, స్కామ్లకు కేరాఫ్ అడ్రస్గా ఉండేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కోల్ సెక్టార్లో అనేక మార్పులు తెచ్చినట్లు తెలిపారు.
Kishan Reddy Counter | అనేక సంస్కరణలు
మోదీ (Modi) పాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని కిషన్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 70 శాతానికి పైగా విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రస్తుతం దేశ అవసరాల మేరకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. బొగ్గు విద్యుత్తో పాటు అనేక రంగాలకు అవసరం అన్నారు. బొగ్గు దిగుమతులను తగ్గించామన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న బొగ్గు రంగంలోకి ప్రైవేట్ సెక్టార్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా బొగ్గు గనులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.
Kishan Reddy Counter | క్రిటికల్ మినరల్స్ కోసం..

స్టీల్ ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. సిమెంట్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడించారు. క్రిటికల్ (రేర్) మినరల్లో మనం వెనకబడి ఉన్నామని చెప్పారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. 90 శాతం క్రిటికల్ మినరల్స్ను భారత్ దిగుమతి చేసుకుంటుందన్నారు. సెమి కండక్టర్లు, ఎలక్ట్రిక్, ఆటో మొబైల్ రంగాల్లో వీటి పాత్ర కీలకమన్నారు. దీంతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ప్రారంభించామన్నారు. దీనికి మొదటి విడతగా ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కేటాయించిందన్నారు.
కేటీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా.. గతంలో బీఆర్ఎస్ గానీ, ఇప్పుడు కాంగ్రెస్ గానీ ఏ విషయంలోనూ కేంద్రాన్ని… pic.twitter.com/r4nV0Qzvje
— Akshara Today | Telugu News (@aksharatoday) June 8, 2026
ఇది కూడా చదవండి..: Rahul Ramakrishna Tweets | డిప్యూటీ సీఎం పవన్పై టాలీవుడ్ కమెడియన్ ప్రశ్నల వర్షం
