అక్షరటుడే, బోధన్: Education Department | సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్లోని అడ్మిషన్ రిజిష్టర్(Admission Register) మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.
Education Department | బోధన్ పట్టణంలో..
బోధన్(Bodhan) పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న జేసీ ఉన్నత పాఠశాలలో రిజిస్టర్ మాయమైంది. కొన్నిరోజులుగా అడ్మిషన్ రిజిస్టర్ మాయమవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. విద్యాసంవత్సంరం ప్రారంభం అయిన నేపథ్యంలో అడ్మిషన్ల కోసం వచ్చే తల్లిదండ్రులకు వేరే రిజిస్టర్ పెట్టి అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2019 నుంచి విద్యార్థుల పేర్లు, వివరాలను నమోదై ఉన్న రిజిస్టర్ సుమారు 40 రోజులుగా కనిపించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత హెచ్ఎంను వివరణ కోరగా పాఠశాలలోని సిబ్బంది కారణంగా రిజిస్టర్ మాయమైందని.. పోలీసులకు(Bodhan Police) సైతం ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్ను ప్రశంసించిన బాబా రాందేవ్