అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: SI Transfers | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate) పరిధిలో ముగ్గులు ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
SI Transfers | ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు..
ప్రస్తుతం వీఆర్లో ఉన్న సాయన్న నాల్గో టౌన్కు బదిలీ అయ్యారు. వీఆర్లోనే ఉన్న ఉమెన్ ఎస్సై కల్యాణిని నగరంలోని ఒకటో టౌన్కు ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వీఆర్లో ఉంటూ నందిపేట్ పీఎస్లో అటాచ్గా పనిచేస్తున్న ఎల్ రాంను బోధన్ పట్టణ పోలీస్స్టేషన్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని.. అధికారులు వెంటనే ఆయా పోలీస్స్టేషన్లలో ఛార్జ్ తీసుకోవాలని సీపీ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: వెనిజులాలో భూకంపం