అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Car Theft | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటో ఠాణా పరిధి గాంధీచౌక్ సమీపంలో ఇటీవల జరిగిన కారు చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన కారును స్వాధీనం చేసుకున్నారు.
Nizamabad Car Theft | ప్రయాణికుడిగా కారులో ఎక్కి
పోలీసులు Police తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు తన కారు CAR లో రైల్వే స్టేషన్ నుంచి గాంధీచౌక్ వైపు వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణికుడిగా కారులో ఎక్కి తనను ఓ ప్రాంతానికి తీసుకెళ్లాలని కోరాడు.
అనంతరం గాంధీచౌక్ సమీపానికి చేరుకున్న తర్వాత పండ్లు కొనుగోలు చేయాలని చెప్పి డ్రైవర్ను కారులో నుంచి దిగి పండ్లు తీసుకురావాలని నమ్మించాడు. డ్రైవర్ కారు నుంచి దిగిన అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు.
Nizamabad Car Theft | నిందితుడు జోధ్పూర్ వాసి..
బాధితుడి ఫిర్యాదు మేరకు టౌన్–I పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి అపహరణకు గురైన కారును స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుడిని లఖ్విందర్ సింగ్ (30) గా గుర్తించారు. అతను పంజాబ్ రాష్ట్రంలోని జోధ్పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ విధించింది.
Nizamabad Car Theft | నేరాల నియంత్రణకు గట్టి నిఘా
ఆస్తి సంబంధిత నేరాలను అరికట్టేందుకు పహారా, నిఘా, ప్రత్యేక దర్యాప్తు చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అపరిచిత వ్యక్తులను సులభంగా నమ్మవద్దని, ప్రయాణ సమయంలో తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే వాహనాలను నిర్లక్ష్యంగా వదిలివేయకుండా, నాణ్యమైన భద్రతా తాళాలు, భద్రతా పరికరాలు వినియోగించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా అత్యవసర పోలీస్ సేవలకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.