Bodhan Co-option | బోధన్​ కో–ఆప్షన్​ ఎన్నికలను బహిష్కరించిన ఎంఐఎం, బీజేపీలు

బోధన్​ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్​ : Bodhan Co-option | పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కో–ఆప్షన్ సభ్యుల (Co-option Election) ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికను బహిష్కరిస్తూ బీజేపీ(BJP), ఎంఐఎం(MIM) కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు.

Bodhan Co-option | సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో..​

బోధన్(Bodhan) నియోజకవర్గం కో–ఆప్షన్ ఎన్నికను మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) ఆధ్వర్యంలో.. కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) ముఖ్య​ అతిథిగా హాజరు కాగా.. ఎన్నిక కార్యక్రమం జరిగింది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా.. వారు ఎన్నికలను బహిష్కరించారు. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా ఒకేసారి కోఆప్షన్ ఎన్నిక, కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడంపై గుర్రుగా ఉన్న ఎంఐఎం వైస్​ఛైర్మన్ మీర్​ ఇలియాజ్​ అలీ​ ఆధ్వర్యంలో.. ఎలక్షన్​ను బాయ్​కాట్​ చేసింది. అలాగే కాంగ్రెస్, బీఆర్​ఎస్​, ఎంఐఎంల అనైతిక పొత్తును నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు.

12 5

bodhan 4

Bodhan Co-option | కో ఆప్షన్ అనంతరం జనరల్ బాడీ మీటింగ్..

మూడు నెలల అనంతరం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న సమస్యలపై వాడీవేడిగా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎజెండా అంశాలను చర్చించకుండానే కేవలం నిమిషాల వ్యవధిలోనే జనరల్​ బాడీ మీటింగ్​ను ముగించడంపై సైతం బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సమావేశం హాల్​ నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. పూర్తిగా ఏకపక్షంగా జనలల్​ బాడీ సమావేశం నిర్వహించారని.. ఎలాంటి సమస్యలను చర్చించకుండానే ముగించారని వారు నినదించారు.

bjpbjp mim

ఇది కూడా చదవండి: SIR కోసం శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేయనున్న కర్ణాటక ప్రభుత్వం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *