Welfare Schemes | పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రభుత్వ సలహాదారు పోచారం

Shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Welfare Schemes | పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్​రెడ్డి (Pochaaram Srinivas Reddy) అన్నారు. వర్ని(Varni) మండల కేంద్రంలోని సీసీడీ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ (Shaadi Mubarak) చెక్కులను ఆగ్రోస్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ కాసుల బాలరాజుతో కలిసి అందజేశారు.

Welfare Schemes | 286 మందికి చెక్కులు..

నియోజకవర్గంలోని వర్ని, చందూర్ (Chandur), మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాలకు చెందిన మొత్తం 286 మంది లబ్ధిదారులకు రూ. 2.86 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో వర్ని మండలానికి చెందిన 67 మందికి రూ. 67 లక్షలు, చందూర్ మండలానికి చెందిన 33 మందికి రూ. 33 లక్షలు, మోస్రా మండలానికి చెందిన 16 మందికి రూ. 16 లక్షలు, రుద్రూర్ మండలానికి చెందిన 15 మందికి రూ. 15 లక్షలు, కోటగిరి మండలానికి చెందిన 96 మందికి రూ.96 లక్షలు, పోతంగల్ మండలానికి చెందిన 59 మందికి రూ. 59 లక్షల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : RTC Compensation | ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం.. ఒకరికి ఉద్యోగం

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *