అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Theft Scare | కామారెడ్డి పట్టణంలో (Kamareddy City) దొంగల సంచారం కలకలం రేపుతోంది. శివారు కాలనీల్లో అపరిచిత వ్యక్తులు అర్ధరాత్రి తర్వాత చేతిలో ఆయుధాలతో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.
Kamareddy Theft Scare | జయశంకర్ కాలనీలో..
ఇటీవల పట్టణంలో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. లిక్కర్ మార్ట్(Liquor Mart), షాపులు, ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతికత ఆధారంగా చోరీలకు పాల్పడుతున్న దొంగలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. అయినా దొంగల సంచారం పెరుగుతూనే ఉంది. తాజాగా జయశంకర్ కాలనీలో దొంగలు కలకలం సృష్టిస్తున్నారు.
దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి వేళలో దొంగతనానికి పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు(Kamareddy Police) సమాచారం ఇచ్చారు. గతంలో కూడా ఇదే కాలనీలో భారీ దొంగతనాలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. వేసవికాలం దృష్ట్యా సెలవులు ఉండడంతో పలువురు ఇళ్లకు తాళాలు వేసి టూర్లు, సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగతనాలకు పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇళ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళలో శివారు కాలనీల్లో పోలీస్ గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి


