అక్షరటుడే, వెబ్డెస్క్: Warangal Bhadrakali Temple | వరంగల్ (Warangal) భద్రకాళి ఆలయం దగ్గర శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ (కుడా) భూముల వేలం వ్యవహారంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తడి దస్తులతో అమ్మవారిని దర్శించుకున్నారు.
Warangal Bhadrakali Temple | సంప్రోక్షణకు పిలుపు

ఆలయాన్ని రాజకీయాలతో అపవిత్రం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. గుడిని సంప్రోక్షణ చేస్తామని ఆ పార్టీ నాయకులు శనివారం తరలివచ్చారు. పసుపు నీళ్లతో ఆలయ ఆవరణలో శుభ్రం చేసేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
Warangal Bhadrakali Temple | పవిత్రతను దెబ్బ తీశారు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ.. భద్రకాళి అమ్మవారి ఆలయ పవిత్రతను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దెబ్బతీశారన్నారు. ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవమైన అమ్మవారి ఆలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. కుడా మాజీ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ వెంకట్రామరెడ్డి ఆలయంలో తడిబట్టలతో ప్రవేశించి ప్రమాణాలు చేయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, దీంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Police Recruitment | 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. అభ్యర్థులకు అలర్ట్