Varahi Temple Construction | వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలోని అమ్మనగర్​లో వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గురువారం ప్రారంభించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Varahi Temple Construction | నగరంలోని( Nizamabad ) అమ్మనగర్​లో వారాహీ అమ్మవారి(Varahi Temple) ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

Varahi Temple Construction | వారాహీ అమ్మవారి కృపాకటాక్షాలు..

వారాహీ అమ్మవారి కృపాకటాక్షాలు నగర వాసులపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నగరంలోని అమ్మ నగర్​లో నిర్మిస్తున్న ఆలయ పనులను గురువారం ప్రారంభించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని తొలి వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కృష్ణశిలతో ఆలయాన్ని నిర్మించటం సంతోషకరమన్నారు. ఇందూరులో ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, హిందువుల ఐక్యతకు ఆలయాలు దోహదపడతాయన్నారు. యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిత్య ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరమన్నారు. ఇకపై జరిగే వారాహీ అమ్మవారి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మంచాల జ్ఞానేందర్, ఎల్​వీఆర్​ అధినేత శివ ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

mla11

ఇది కూడా చదవండి: BIG BREAKING : బండి భగీరథ్​కు బెయిల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *