Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం మాదే.. అమెరికా-ఇరాన్ పరస్పర ప్రకటనలు

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ, "పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమైతే దాని పరిణామాలు అత్యంత వినాశకరంగా ఉంటాయి" అని హెచ్చరించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Strait of Hormuz | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని అమెరికా, ఇరాన్ సోమవారం వేర్వేరుగా ప్రకటించాయి. దీంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

Strait of Hormuz | కంటైనర్ నౌకపై దాడితో..

ఒమన్ తీరానికి సమీపంలోని హోర్ముజ్ జలసంధిలో ఆదివారం ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనతో అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి భద్రతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి ద్వారానే తరలించబడుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వాణిజ్య నౌకలపై దాడులు, బెదిరింపులతో ఈ మార్గంలో నౌకాయానం అంతరాయం ఎదుర్కొంటోంది.

Strait of Hormuz

Strait of Hormuz | 60 రోజుల గడువు నిర్ణయించినప్పటికీ

ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక ఒప్పందం ప్రకారం శాశ్వత శాంతి చర్చలకు 60 రోజుల గడువు నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు చర్చల దిశగా కాకుండా పరస్పర దాడుల వైపు సాగుతున్నాయి. దీంతో పూర్తి స్థాయి ఘర్షణ మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ, “పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమైతే దాని పరిణామాలు అత్యంత వినాశకరంగా ఉంటాయి” అని హెచ్చరించారు.

Trump on Hormuz | హర్ముజ్​ జలసంధిలో నౌకలపై పన్ను.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Strait of Hormuz | వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడులు..

ఇదిలా ఉండగా, అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) సోమవారం నిర్వహించిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలు లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ పరికరాలు, చిన్న పడవలపై దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

“హోర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. దీనిపై ఇరాన్‌కు నియంత్రణ లేదు” అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *